Chandrababu: సోము వీర్రాజు.. నీకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి : బుద్దా వెంకన్న

  • పట్టిసీమ ద్వారా రైతులు ఎంతో లాభపడ్డారు
  • చంద్రబాబును సోము వీర్రాజు విమర్శించడం హాస్యాస్పదం
  • ఎమ్మెల్సీ పదవిని ఆయనకు టీడీపీ భిక్షగా పెట్టింది
  • సోము వీర్రాజు లాంటి వ్యక్తులను ప్రజలు బహిష్కరించాలి

ఏపీ ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని ఆరోపణలు చేసిన బీజెపీ నేత సోము వీర్రాజు కు దమ్ముంటే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. టీడీపీపై, ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న స్పందించారు. పట్టిసీమ ద్వారా రైతులు ఎంతో లాభపడ్డారని, ఈ విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని సోము వీర్రాజు నిజంగా భావిస్తే, వెంటనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే సోము వీర్రాజుకు ఏడు వేల ఓట్లు వచ్చాయని, అది ఆయన ప్రజాబలమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ మాత్రం ప్రజాబలం లేని సోము వీర్రాజు వంటి నాయకులు చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవిని టీడీపీ భిక్షగా పెట్టిందని అన్నారు. సోము వీర్రాజు తన ఎమ్మెల్సీ పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగి కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న సోము వీర్రాజు లాంటి వ్యక్తులను ప్రజలు బహిష్కరించాలని ఈ సందర్భంగా బుద్దా వెంకన్న అన్నారు.

More Telugu News