bjp: పార్లమెంట్ లో మనవాళ్లు జోకర్స్ లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ నేత రామకోటయ్య

  • టీడీపీ యూటర్న్ తీసుకుంది
  • పార్లమెంట్ లో ఆ పార్టీ ఎంపీల తీరు చాలా బాధాకరం
  • వేషాలు వేస్తున్న మన వాళ్లు జోకర్స్ లా కనిపిస్తున్నారు
  • టీడీపీ తమ హుందాతనం కాపాడుకోవాలి: రామకోటయ్య

పార్లమెంట్ లో మన ఎంపీలు జోకర్స్ లా ప్రవర్తిస్తున్నారంటూ బీజేపీ నేత రామకోటయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఏబీఎన్’ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఏపీకి తాము చెయ్యాల్సింది చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదని, వారు మాట్లాడే విధానం సబబుగా లేదని విమర్శించారు.

టీడీపీ యూటర్న్ తీసుకుని పార్లమెంట్ లో ఆ పార్టీ ఎంపీలు అవలంబిస్తున్న విధానం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందని, ఒక రోజు చిన్నపిల్లాడిలాగా, మరోరోజు చేపలు పట్టే వాడిలా..ఇలా వేషాలు వేస్తున్న మన వాళ్లు జోకర్స్ లా కనపిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తమ హుందాతనం కాపాడుకోవాలని, ఏపీ అభివృద్ధికి పాటుపడేది బీజేపీయేనని, రైల్వేజోన్ తప్పకుండా ఇస్తామని అన్నారు.

More Telugu News