somireddy: ఏ ప్రాంతీయ పార్టీ కూడా బీజేపీని నమ్మే పరిస్థితి లేదు: మంత్రి సోమిరెడ్డి

  • ఇన్నాళ్లూ రాష్ట్రం కోసం ఎన్నో అవమానాలు భరించాం
  • మేము ధర్మాన్ని పాటిస్తే, బీజేపీ అధర్మాన్ని పాటించింది
  • అవినీతిపరులకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇస్తున్నారు : మంత్రి సోమిరెడ్డి

ఏ ప్రాంతీయ పార్టీ బీజేపీని నమ్మే పరిస్థితిలో లేదని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇన్నాళ్లూ రాష్ట్రం కోసం ఎన్నో అవమానాలు భరించామని, అమిత్ షా ఆపరేషన్ ఏడు రాష్ట్రాల్లో అన్నారని, ఏ ఆపరేషన్ కూ టీడీపీ భయపడదని అన్నారు. తెలంగాణలో బీజేపీనే టీడీపీతో తెగదెంపులు చేసుకుందని, ఈ నాలుగేళ్లూ తాము ధర్మాన్ని పాటిస్తే, బీజేపీ అధర్మాన్ని పాటించిందని, ఈశాన్య రాష్ట్రాలకు సాయం చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీని విస్మరించిందని మండిపడ్డారు.

వైసీపీ అధినేత జగన్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, అవినీతిపరులకు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇస్తున్నారని విమర్శించారు. టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, తమపై ఉన్న కేసుల మాఫీ, అవినీతి సొమ్మును కాపాడుకునేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. జగన్ ఫ్యాన్ స్విచ్ మోదీ దగ్గర ఉందని  విమర్శించారు.

More Telugu News