మేము ఎన్డీఏ నుంచి బయటికొచ్చాక మీకు అవినీతి కనపడిందా?: బీజేపీపై పరిటాల సునీత ఫైర్
- ఏపీ సర్కారుపై విష్ణుకుమార్ రాజు ఆరోపణలు
- కౌంటర్ ఇచ్చిన పరిటాల సునీత
- పట్టిసీమ అద్భుతంగా ఉందని గతంలో విష్ణుకుమార్ రాజు అన్నారని వ్యాఖ్య
- ఇప్పుడు 'అవినీతి' అంటూ ఎలా మాట్లాడారో అర్థం కావట్లేదని విమర్శ
ఈ నేపథ్యంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమ అద్భుతంగా ఉందని గతంలో విష్ణుకుమార్ రాజు అన్నారని, ఇప్పుడు ఈ విధంగా ఎలా మాట్లాడారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతోనే బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని భావిస్తున్నామని అన్నారు. పట్టిసీమ వల్ల ఇప్పుడు రాయలసీమకు తాగు, సాగు నీళ్లు అందుతున్నాయని చెప్పారు.