polavaram: ‘పోలవరం’ పనులకు రూ.1400 కోట్లు..అనుమతిచ్చిన కేంద్రం!

  • నాబార్డు నుంచి రూ.1400 కోట్లు తీసుకోండి
  • ఏపీ ప్రభుత్వానికి అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు
  • గ్రామీణ ఆరోగ్య మిషన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు విడుదల

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నిమిత్తం రూ.1400 కోట్లు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. నాబార్డు నుంచి ఈ మొత్తాన్ని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వానికి, నాబార్డుకు సంబంధిత శాఖలకు కేంద్ర ప్రభుత్వం పంపింది. కాగా, ఏపీకి గ్రామీణ ఆరోగ్య మిషన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.16.7 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

More Telugu News