BJP: నామినేటెడ్ పదవులకు త్వరలో రాజీనామా చేస్తాం : సోము వీర్రాజు

  • ప్రత్యేకహోదా కావాలని  ఇప్పుడు ఏ విధంగా అడుగుతున్నారు?
  • ఇప్పటివరకూ ఏపీ రాజధాని డిజైన్ పూర్తి కాలేదు
  • పవన్ వ్యాఖ్యలకు సమాధానమివ్వరే?  
  • ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు

నామినేటెడ్ పదవులకు త్వరలో రాజీనామా చేస్తామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా అని అడిగితే జైలుకు వెళ్తారని నాడు వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, ఆ హోదా కావాలని ఇప్పుడెలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఏపీ రాజధాని డిజైన్ పూర్తి కాలేదని, తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఇచ్చిన యూసీలో ఏమున్నాయో శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానమివ్వకుండా, బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివారని విమర్శించడం తగదని అన్నారు.  ఏపీలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణలను తట్టుకునే శక్తి బీజేపీకి ఉందని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ మూడేళ్లలో పూర్తి చేయలేకపోవడంతో అనేక మంది చనిపోయారని, రూ.52 వేల కోట్లతో నిర్మించే పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి ఏ విధంగా పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. 

More Telugu News