భద్రాద్రిలో రేపటి నుంచి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు!

  • రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
  • ఈ నెల 26న శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం
  • హాజరు కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రేపటి నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. ఈ నెల 26న శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం జరుగనుండగా, 27న మహాపట్టాభిషేకోత్సవం జరగనుంది. శ్రీ సీతారామచంద్రుల తిరుకల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా హాజరు కానుండగా, మహాపట్టాభిషేకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు.
Go Back to Shorts
Bhadradri Kothagudem District
bhadrachalam temple
Telangana
Lord SriRama

More Telugu News