Bhadradri Kothagudem District: భద్రాద్రిలో రేపటి నుంచి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు!

  • రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
  • ఈ నెల 26న శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం
  • హాజరు కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రేపటి నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. ఈ నెల 26న శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం జరుగనుండగా, 27న మహాపట్టాభిషేకోత్సవం జరగనుంది. శ్రీ సీతారామచంద్రుల తిరుకల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా హాజరు కానుండగా, మహాపట్టాభిషేకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు.

More Telugu News