vijayalakshmi: 'గులాబీ'లో ఆ సాంగ్ నేను పాడాల్సింది .. చాలా బాధపడ్డాను: సింగర్ విజయలక్ష్మి

  • ఆ పాటను నాతో పాడించారు 
  • ఆ తరువాత వేరే సింగర్ తో ఓకే చేశారు 
  • అడిగితే సరైన ఆన్సర్ రాలేదు  

మధురమైన స్వరంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న గాయనీమణులలో విజయలక్ష్మి ఒకరు. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. కెరియర్లో తనకి ఎదురైన కొన్ని అనుభవాలలో భాగంగా 'గులాబీ' సినిమాను గురించి ప్రస్తావించారు. " ఈ సినిమా విషయంలో నేను అలా వెళ్లి ఒక పాట పాడేసి ఇలా వెనక్కి వచ్చేయలేదు. ఆ పాట కోసం నేను చాలా రోజులు వర్క్ చేశాను .. కంపోజింగ్ లోను వున్నాను" అన్నారు.

 "శశిప్రీతమ్ ట్యూన్ చేయడం దగ్గర నుంచి నాకు తెలుసు. ఆ పాటను నేను పాడటం .. ఓకే కావడం కూడా జరిగిపోయింది. ఆ తరువాత చూస్తే .. వేరే సింగర్ తో మళ్లీ పాడించారు. కారణమేంటని అడిగితే సరైన సమాధానం రాలేదు. ఆ పాట కోసం టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టడం వలన నేను చాలా బాధపడ్డాను" అంటూ చెప్పుకొచ్చారు.  

More Telugu News