galla jaydev: ఏపీలోనూ అదే వ్యూహం అమ‌లుకు ప్ర‌య‌త్నిస్తున్నారు: ఎంపీ గల్లా జయదేవ్

  • త‌మిళ‌నాడులో బీజేపీ చిన్న పార్టీల‌ను ప్రోత్స‌హించింది
  • అక్కడ పెద్ద పార్టీల‌ మ‌ధ్య వివాదం సృష్టించారు
  • కేంద్ర ప్ర‌భుత్వంపై మాకు విశ్వాసం పోయింది
  • బీజేపీ నీచ రాజ‌కీయాలు ప్రారంభించింది

భార‌తీయ జ‌న‌తా పార్టీపై టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ రాజ‌కీయ కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మిళ‌నాడులో బీజేపీ చిన్న పార్టీల‌ను ప్రోత్స‌హించిందని, పెద్ద పార్టీల‌ మ‌ధ్య వివాదం సృష్టించింద‌ని ఆరోపించారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ బీజేపీ నేత‌లు అదే వ్యూహం అమ‌లుకు ప్ర‌య‌త్నిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వంపై త‌మ‌కు విశ్వాసం పోయిందని, బీజేపీ నీచ రాజ‌కీయాలు ప్రారంభించిందని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎంత కష్ట‌ప‌డ‌యినా స‌రే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను సాధిస్తామ‌ని అన్నారు. 

More Telugu News