javan: మావోయిస్టుల కాల్పుల్లో 8 మంది జవాన్ల మృతి

  • ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో నష్టపోయిన మావోయిస్టులు 
  • జ‌వాన్ల‌పై మావోయిస్టుల ప్ర‌తికార చ‌ర్య‌
  • మరో ఆరుగురు జవాన్ల‌కు తీవ్ర‌గాయాలు

తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో నష్టపోయిన మావోయిస్టులు ఈ రోజు జ‌వాన్ల‌పై ప్ర‌తీకార చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని గొల్లపల్లి-కిష్టరాం ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తోన్న‌ సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై కాల్పుల‌కు తెగ‌బ‌డి 8 మంది జవాన్ల ప్రాణాలు తీశారు. ఈ కాల్పుల్లో మరో ఆరుగురు జవాన్ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఆసుప‌త్రికి తరలిస్తున్నారు. గాయాల‌పాలైన జ‌వాన్ల‌ను రాయ్‌పూర్ ఆసుప‌త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

More Telugu News