maoist: ఎన్ కౌంటర్లో చనిపోయింది వీరే: పోలీసుల ప్రకటన

  • 10 మంది మావోయిస్టుల మరణం
  • ఒక్కరు తెలంగాణ, మిగిలినవారు ఛత్తీగఢ్ కు చెందినవారు
  • తెలంగాణ మావోయిస్టు పేరు స్వామి అలియాస్ ప్రభాకర్

దండకారణ్యంలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్లో 10 మంది మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే. మరణించిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వివరించారు. చనిపోయిన వారిలో ఒకరు తెలంగాణకు చెందినవారు కాగా, మిగిలిన వారంతా ఛత్తీస్ ఘడ్ కు చెందినవారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.

తెలంగాణకు చెందిన మావోయిస్టు పేరు స్వామి అలియాస్ ప్రభాకర్. వరంగల్ జిల్లా హన్మకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందినవాడు. బీఏ, బీఈడీ చదివిన ప్రభాకర్ 14 సంవత్సరాలుగా మావోయిస్టుగా పనిచేస్తున్నారు. మిగిలిన మృతుల్లో రమే (వీరాపురం), బుద్రి (సింగం), కోసి (రంగాయిగూడెం), కమల (పశ్చిమ బస్తర్), రత్న (బిజాపూర్), సుక్కి (గంగ్లూర్), ఐతు (తిప్పాపురం), సోంబి (తిప్పాపురం), మల్లేష్ (ఇంద్రావతి)లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

More Telugu News