meghalaya: హంగ్ దిశగా మేఘాలయ ఫలితాలు

  • ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యతను ఇవ్వని ఓటర్లు
  • ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 30 సీట్లు రావాలి
  • 27 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మేఘాలయలో... హంగ్ దిశగా ఫలితాలు వస్తున్నాయి.  ఏ పార్టీకి కూడా ఓటర్లు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదు. మొత్తం 59 సీట్లున్న మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే... 30 సీట్లను సాధించాలి. ఈ మెజారిటీ ఏ పార్టీకి దక్కే అవకాశం లేదు.

తాజా ట్రెండ్స్ ప్రకారం... బీజేపీ కూటమి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్పీపీ 10 స్థానాలు, కాంగ్రెస్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 14 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. కొంచెం అదృష్టం కలసి వస్తే... కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 

More Telugu News