Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'మహానటి' విడుదల వాయిదా?
  • నిఖిల్ 'కిరాక్ పార్టీ' విడుదలకు రెడీ 
  • మణిరత్నంకు లైఫ్ టైం ఎఛీవ్ మెంట్ అవార్డు 
  • సునీల్ హీరోగా మరో సినిమా    

*  కీర్తి సురేశ్ నాయికగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మహానటి' చిత్రం విడుదల వాయిదా పడినట్టు సమాచారం. మొదట్లో ప్రకటించినట్టు ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కావడం లేదని, వేసవి చివర్లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. నెలాఖరుకి ఈ చిత్రం పనులు పూర్తికాకపోవడంతో పాటు, ఏప్రిల్ లో పెద్ద చిత్రాల విడుదల ఉండడంతో దీనిని వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు.  
*  యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం 'కిరాక్ పార్టీ' పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 16న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ హీరోయిన్లుగా నటించారు.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నంను బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు లైఫ్ టైం ఎఛీవ్ మెంట్ అవార్డుతో సత్కరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా తనకు అందజేసిన 10 లక్షల నగదును కర్ణాటక చలన చిత్ర అకాడమీకి మణిరత్నం తిరిగి విరాళంగా ఇచ్చేశారు.
*  కామెడీ చిత్రాల కథానాయకుడు సునీల్ మరో చిత్రంలో హీరోగా నటించనున్నాడు. 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రాన్ని రూపొందించిన త్రికోటి దర్శకత్వం వహించే చిత్రంలో హీరోగా నటించడానికి సునీల్ ఓకే చెప్పినట్టు సమాచారం. 

More Telugu News