sridevi: ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు!: శ్రీదేవి మృతిపై అమితాబ్‌ గుర్తు చేసిన కవిత

  • అలా అని నీలా ఇంత తొందరగా లోకాన్ని విడిచి వెళ్లిపోరు
  • ఈ సమయంలో ఈ కవితను ప్రస్తావించడం సరైంది
  • గ‌తంలో కైఫీ ఆజ్మీ రాసిన కవితను పోస్ట్ చేసిన అమితాబ్‌

అతిలోక సుంద‌రి శ్రీదేవి హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విషాదంపై కొంద‌రు సినీ ప్ర‌ముఖులు క‌విత‌లు కూడా రాసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ రెండు లైన్ల కవితను ట్వీట్ చేసి, ‘ఈ సమయంలో ఈ కవితను ప్రస్తావించడం సరైంది’ అని పేర్కొన్నారు.

‘ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు. అలా అని నీలా ఇంత తొందరగా లోకాన్ని విడిచి వెళ్లిపోరు’ అంటూ ట్వీట్ చేశారు. గ‌తంలో ప్రముఖ కవి కైఫీ ఆజ్మీ ఈ కవితను రాశారు. ఆ క‌విత‌నే ఈ సందర్భంగా అమితాబ్ పోస్ట్ చేశారు. కాగా, శ్రీదేవి అంతిమ సంస్కారాలు నిన్న ముంబయి విల్లే పార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో ముగిసిన విషయం విదితమే. 

More Telugu News