Sridevi: శ్రీదేవి చివరి కోరిక మేర అంతిమయాత్రలో తెల్లని పూలు?

  • శ్రీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టమట
  • అంతిమ యాత్రకు ఉపయోగించే వాహనం, పువ్వులు ఆ రంగువే వినియోగిస్తారట 
  • రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీదేవి అంత్యక్రియలు

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో

సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో...

'ఆఖరిపోరాటం' సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి ఈ పాటలో తెల్లని వస్త్రాలలో మెరిసిపోతూ వుంటుంది. ఆ పాటలో వర్ణించినట్టే శ్రీదేవికి తెలుపు అంటే చాలా ఇష్టమట. అందుకే, తన అంతిమ యాత్రకు సంబంధించిందంతా తెలుపు రంగులో ఉండాలన్నదే శ్రీదేవి ఆకాంక్ష అనే వార్త ఒకటి ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది.

ఈ నేపథ్యంలో, ఆమె అంతిమ యాత్రకు ఉపయోగించే వాహనం, పువ్వులు.. తెలుపు రంగువే వినియోగించనున్నట్టు తెలుస్తోంది. దీనికి బలాన్నిస్తూ, అనిల్ కపూర్ నివాసంలోకి తెల్లని పువ్వులతో నిండిన గంపలను తీసుకెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ రోజు రాత్రి పది గంటలకు శ్రీదేవి భౌతికకాయం భారత్ కు చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం పదకొండు గంటల వరకు శ్రీదేవి స్వగృహంలో ఆమె భౌతికకాయాన్ని ఉంచుతారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్యక్రియలు జరగనున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.

More Telugu News