allari naresh: వచ్చేనెలలో అల్లరి నరేశ్ కొత్త ప్రాజెక్టు మొదలు

  • భీమనేనితో అల్లరి నరేశ్ 
  • ఆ తరువాత సినిమా పి.వి.గిరితో 
  • త్వరలోనే సెట్స్ పైకి

హాస్య కథానాయకుడిగా అల్లరి నరేశ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. అన్నివర్గాల ప్రేక్షకుల్లోను ఆయనకి మంచి ఆదరణ వుంది. ఈ కారణంగానే ఆయన చకచకా 50 సినిమాలను పూర్తిచేసేశాడు. అయితే కొంతకాలంగా ఆయనకి సరైన హిట్ పడటం లేదు. ఈ విషయంపై ఆయనతో పాటు అభిమానులు కూడా అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో తనకి 'సుడిగాడు'తో సూపర్ హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాసరావుతో ఒక సినిమా చేస్తున్నాడు.

 ఇది కాకుండా దర్శకుడు పి.వి.గిరికి కూడా ఆయన ఓకే చెప్పేశాడు. గతంలో ఈ దర్శకుడు 'నందిని నర్సింగ్ హోమ్' అనే సినిమాను తెరకెక్కించాడు. ఆయన వినిపించిన కథ కొత్తగా అనిపించడంతో అల్లరి నరేశ్ ఆసక్తిని చూపించాడని అంటున్నారు. మార్చి మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నారు.       

More Telugu News