bcci: ఐసీసీ అభ్యర్థనకు నో చెప్పేసిన బీసీసీఐ

  • ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు
  • ఏప్రిల్ 22 నుంచి కోల్‌కతాలో ఐసీసీ వార్షిక సమావేశం
  • కోల్‌కతాలో ఐదు రోజులు ఐపీఎల్‌ మ్యాచులు నిర్వహించాలన్న ఐసీసీ 
  • తిరస్కరించిన బీసీసీఐ

ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఓ కోరిక కోరింది. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు కోల్‌కతాలో ఐసీసీ వార్షిక సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆయా తేదీల్లో జరిగే ఐపీఎల్ మ్యాచులను కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించాలని అడిగింది.

ఆ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు ఐపీఎల్‌ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. అయితే, ఆయా తేదీల్లో హైదరాబాద్, ముంబయి, ఇండోర్, బెంగళూరు, జైపూర్‌ల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో షెడ్యూల్‌లో మార్పులు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించింది. దీంతో మార్పులు చేయబోమని ఐసీసీకి బీసీసీఐ సూటిగా చెప్పేసింది.  

More Telugu News