Road Accident: బీహార్లో పాఠశాల వద్ద కారు బీభత్సం.. 9 మంది చిన్నారుల మృతి.. 24 మందికి గాయాలు

  • బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘటన
  • ఒక్కసారిగా అదుపుత తప్పి పాఠశాల వైపునకు దూసుకెళ్లిన కారు
  • పరారీలో డ్రైవర్

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ బొలెరో కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపు తప్పి పాఠశాల వైపునకు దూసుకెళ్లడంతో తొమ్మిది మంచి చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బొలెరో కారు ఓ బీజేపీ నేతదని తెలుస్తోంది. ఈ ఘటనలో గాయాలపాలైన చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆ కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. డ్రైవర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రోడ్డుపై ధర్నా చేశారు. మృతుల కుటుంబాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రకటన చేశారు.  

More Telugu News