gopichand: గోపీచంద్ కి గట్టిపోటీనే ఇవ్వనున్న విజయ్ దేవరకొండ

  • మే 18వ తేదీన గోపీచంద్ 'పంతం' రిలీజ్
  • ఆయనకి ఇది 25వ సినిమా  
  • అదే రోజున విజయ్ దేవరకొండ మూవీ

కొంతకాలంగా గోపీచంద్ కి సరైన హిట్ లేదు. దాంతో ఆయన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ క్రమంలోనే కథా కథనాలు కొత్తగా అనిపించడంతో ఆయన దర్శకుడు 'చక్రి'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గోపీచంద్ ఎన్.ఆర్.ఐ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి 'పంతం' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

 ఆయనకి ఇది 25వ సినిమా కావడంతో, అన్ని విషయాల్లోను జాగ్రత్తలు తీసుకున్నాడు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో చిత్రీకరణ పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమాను, మే 18వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున విజయ్ దేవరకొండ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాకి 'టాక్సీవాలా' అనే టైటిల్ ప్రచారంలో వుంది. విజయ్ దేవరకొండకి యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. అందువలన గోపీచంద్ కి విజయ్ దేవరకొండ గట్టిపోటీనే ఇవ్వనున్నాడని అంటున్నారు.   

More Telugu News