Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు భృతి.. త్వరలో ప్రకటన?

  • నిరుద్యోగులకు ప్రతినెల రూ.2వేల భృతి
  • కసరత్తు చేపట్టిన ఆర్థికశాఖ
  • త్వరలోనే ప్రకటన చేయనున్న కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రతినెల రూ.2 వేల భృతిని ప్రకటించనుంది. ఇందుకోసం అవలంబించనున్న విధివిధానాలపై ఆర్థికశాఖ కసరత్తు చేపట్టింది. ప్రతినెలా పింఛన్ తరహాలో నేరుగా నిరుద్యోగుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా పథకం రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రకటన చేయనున్నారు.

More Telugu News