విచారణలో 'రోటామాక్' నిందితుల మౌనం...అరెస్ట్!
- నిందితులను మూడు రోజుల పాటు విచారించిన సీబీఐ
- సహకరించకపోవడంతో తండ్రీతనయుల అరెస్టు
- స్థిరాస్తుల జప్తు, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన ఐటీ
బ్యాంకులను ఏ విధంగా మోసం చేసిందీ, మోసం ద్వారా తమ బ్యాంకు ఖాతాలకు చేరిన సొమ్మును ఎలా ఖర్చు చేసిందీ వారు తమకు చెప్పలేదని అధికారులు తెలిపారు. 2008 నుంచి రోటామాక్ కంపెనీ ఏడు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు అసలు, వడ్డీ కలిపి రూ.3695 కోట్లకు చేరుకుందని వారు చెప్పారు. వారిద్దరినీ నేడు సీబీఐ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. కాగా, సీబీఐ ఇప్పటికే ఢిల్లీ, కాన్పూర్లలోని వారి ఇళ్లను సీల్ చేసింది. మరోవైపు పన్ను ఎగవేతకు సంబంధించి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు కూడా నిందితుల స్థిరాస్తులను జప్తు చేయడంతో పాటు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.