sai dharam tej: తేజు సినిమాలో అనుపమ పాత్రకే ప్రాధాన్యత ఎక్కువట!

  • కరుణాకరన్ తో సాయిధరమ్ తేజ్
  • అనుపమ పాత్ర చుట్టూ తిరిగే కథ 
  • కంటెంట్ పై నమ్మకంతో తేజు  

కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు. కొత్తదనంతో కూడిన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో తేజు పాత్రకంటే అనుపమ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందనేది తాజా సమాచారం.

 'ఫిదా' సినిమాలో సాయిపల్లవి వైపు నుంచి కథ కొనసాగుతుంది. అలాగే ఈ సినిమాలో అనుపమ కోణంలో కథ నడుస్తూ వుంటుందట. ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుందని ముందుగా సాయిధరమ్ తేజ్ కి కరుణాకరన్ చెప్పాడట. అయితే కొత్తదనంతో కూడిన కథ కావడం వలన, వైవిధ్యం కోసం ఈ సినిమా చేయడానికి తేజు అంగీకరించాడని అంటున్నారు. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న తేజుకి, ఈ సినిమా అయినా ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి.

More Telugu News