CCTV: హైదరాబాద్‌లో అర్ధరాత్రి నడిరోడ్డుపై కర్రలతో కొట్టుకున్న యువకులు... సీసీ కెమెరాలో రికార్డు

  • హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • వీడియో వైరల్
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

హైద‌రాబాద్‌లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత అర్ధరాత్రి నడిరోడ్డుపై యువకులు కలకలం రేపారు. కర్రలు, హాకీ స్టిక్స్‌తో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ దాడిలో కొందరు యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై రాగా, కొందరు ఇతర వాహనాలపై వచ్చి గొడవ పడ్డట్టు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ యువకులు ఎవరు, ఎందుకు గొడవ పడ్డారన్న విషయంపై సమాచారం అందాల్సి ఉంది.   

More Telugu News