Arvind Kejriwal: రేపు కమలహాసన్‌ను కలవనున్న కేజ్రీవాల్‌!

  • రేపు కమల్‌ పార్టీ ప్రారంభోత్సవం
  • సాయంత్రం విందు
  • విందులో పాల్గొననున్న కేజ్రీవాల్

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో రేపు మ‌రో కొత్త పార్టీ పుట్టుకొస్తున్న విష‌యం తెలిసిందే. తాను రేపు పార్టీ ప్రారంభించి, త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లు పెడ‌తాన‌ని సినీన‌టుడు కమలహాసన్ ప్ర‌క‌ట‌న చేశారు. కాగా, ఈ నేపథ్యంలో క‌మ‌ల్ రేపు సాయంత్రం మ‌ధురైలో ఇస్తున్న విందులో ఆప్ అధినేత‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన‌నున్నారు. ఈ విషయాన్ని కమల్‌ సన్నిహితులు తెలిపారు.

గతేడాది సెప్టెంబరులో కమలహాసన్‌ను కేజ్రీవాల్ కలిసి, కాసేపు ముచ్చ‌టించి వెళ్లిన విష‌యం తెలిసిందే. దేశంలో అధికమ‌వుతోన్న‌ మత‌తత్వానికి చ‌ర‌మ గీతం పాడాల‌ని ఈ ఇద్ద‌రు నేత‌లు యోచిస్తున్నారు.   

More Telugu News