nikhil: 'కిరాక్ పార్టీ' రిలీజ్ డేట్ ఖరారు

  • శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్ 
  • వచ్చేనెల 23న 'కిరాక్ పార్టీ ' రిలీజ్ 
  • సక్సెస్ పై నిఖిల్ కి బలమైన నమ్మకం

శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా 'కిరాక్ పార్టీ' సినిమా రూపొందుతోంది. సిమ్రాన్ పర్జీనా.. సంయుక్త హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. నిఖిల్ కి స్నేహితులైన సుధీర్ వర్మ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ను అందించగా .. మరో స్నేహితుడైన చందు మొండేటి సంభాషణలు అందించడం విశేషం. అందువలన ఈ సినిమా సక్సెస్ పై నిఖిల్ బలమైన నమ్మకంతో వున్నాడు.

మార్చి 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నిఖిల్ కి ఇది 15వ సినిమా .. ఇది తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన తమిళంలో హిట్ కొట్టిన 'కణితన్' సినిమా రీమేక్ లో చేయనున్నాడు. ఇలా నిఖిల్ వెంటవెంటనే రీమేక్ లు చేస్తుండటం విశేషం.     

More Telugu News