plane crash: 50 మందితో వెళుతున్న విమానం ఇరాన్ లో క్రాష్

  • టెహ్రాన్ నుంచి యాసౌజికి వెళుతుండగా ప్రమాదం
  • పొలాల్లో ల్యాండ్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం 
  • 15 రోజుల వ్యవధిలో రెండో విమాన ప్రమాదం 

50 మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం ఈ రోజు ఇరాన్ లో కూలిపోయింది. 15 రోజుల వ్యవధిలో విమానం కూలిపోయిన రెండో ఘటన ఇది. టెహ్రాన్ నుంచి యాసౌజికి వెళుతున్న విమానం పడేనా పర్వత ప్రాంతంలో కుప్పకూలినట్టు సమాచారం.

కూలిపోవడానికి ముందు ఈ విమానం పొలాల్లో ల్యాండయ్యేందుకు ప్రయత్నించినట్టు కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనంగా స్థానిక టెలివిజన్ ఒకటి పేర్కొంది. విమానం కూలిపోయినట్టు ఇరాన్ బోయర్ పట్టణ గవర్నర్ అహ్మద్ ధ్రువీకరించారు. గత వారం రష్యాలోనూ ఇదే విధంగా ఓ విమానం కూలిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే మాస్కో సమీపంలో విమానం కూలిపోవడంతో 71 మంది మృతి చెందారు.

More Telugu News