Pawan Kalyan: రేపటి రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన మద్దతు: పవన్ కల్యాణ్

  • 'ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల సాధ‌న స‌మితి' ఆధ్వర్యంలో సమావేశం
  • ఐదు కోట్ల మంది ఆంధ్రుల గొంతుక ప్ర‌తిధ్వ‌నించాలి: పవన్
  • ఈ స‌మావేశంలో జ‌న‌సేన ప్ర‌తినిధి కూడా పాల్గొంటారు
  • ఈ కార్య‌క్ర‌మం నిర్వాహ‌కుల‌కు పేరు పేరునా అభినంద‌న‌లు

'ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల సాధ‌న స‌మితి' రేపు విజ‌య‌వాడ‌లో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించి చ‌ర్చించనుంది. ఆ స‌మావేశానికి జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న ఐదు కోట్ల మంది గొంతుక ప్ర‌తిధ్వ‌నించాల‌ని త‌మ పార్టీ భావిస్తోంద‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో జ‌న‌సేన ప్ర‌తినిధి కూడా పాల్గొంటార‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మం నిర్వాహ‌కుల‌కు పేరు పేరునా అభినంద‌న‌లు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.     

More Telugu News