south africa: ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన కోహ్లీ!

  • 8 వికెట్ల తేడాతో విజయం
  • సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచిన కోహ్లీ
  • 5-1తో సిరీస్ సొంతం 

దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన చివరి వన్డే (ఆరో) మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఐదో వన్డేతోనే ఈ సిరీస్ భారత్ సొంతమైనప్పటికీ, చివరి వన్డేలోనూ టీమిండియా తన సత్తా చాటింది. చివరి వన్డేలో దక్షిణాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో ఈ విజయాన్ని కోహ్లీ సేన సాధించింది. 205 పరుగుల విజయ లక్ష్యాన్ని 32.1 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. 129 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కోహ్లీ, ఈ సిరీస్ లో మూడో సెంచరీ చేసి జట్టుకు భారీ విజయం అందించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ను సైతం కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

More Telugu News