India: టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

  • సెంచూరియ‌న్‌లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డే
  • ఇప్పటికే 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
  • ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని టీమిండియా ఉత్సాహం

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఆరు వ‌న్డేల సిరీస్ లో ఇప్ప‌టికే 4-1తో ఆధిక్యంలో ఉన్న భార‌త్ ఈ రోజు చివరి వన్డేలో తలపడుతోంది. సెంచూరియన్‌లో కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే భార‌త్ ఈ సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వన్డేలోనూ గెలవాలనే ఉత్సాహంతో భారత్ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే నాలుగు వన్డేల్లో ఓడి, ఒక మ్యాచ్ లో గెలిచిన దక్షిణాఫ్రికా ఈ వన్డేలో కూడా గెలిచి కనీసం పరువు కాపాడుకోవాలనుకుంటోంది. దక్షిణాఫ్రికాలోని సెంచూరియ‌న్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది.      

More Telugu News