Sanjay Leela Bhansali: బాక్సాఫీసు వద్ద ఏమాత్రం తగ్గని 'పద్మావత్' కలెక్షన్ల జోరు!

  • రూ.265 కోట్ల వసూళ్లు...300 కోట్ల మార్కు దిశగా పరుగులు
  • రిలీజైన మొదటివారంలో రూ.166 కోట్ల కలెక్షన్లు
  • భన్సాలీ వెండితెర అద్భుతానికి ప్రేక్షకుల నీరాజనాలు

వివాదాల నడుమ గతనెల 25న విడుదలయిన 'పద్మావత్' చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటిదాకా రూ.265 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రూ.300 కోట్ల మార్కుకు చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది. రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకునే, షాహీద్ కపూర్ ప్రధాన తారాగణంగా దర్శకధీరుడు సంజయ్ లీలా భన్సాలీ దీనిని అద్భుతంగా తెరకెక్కించారు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ఈ చిత్రం రోజువారీ వసూళ్ల వివరాలను ట్విట్టర్‌లో పొందుపరిచారు.

ఈ చిత్రం రిలీజైన మొదటివారంలోనే రూ.166.50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అప్పటి నుంచి అదే దూకుడును కొనసాగిస్తోంది. రెండో వారంలో రూ.129 కోట్లను వసూలు చేసింది. అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ రాజ్‌పుత్ కర్ణిసేన సహా పలు సంస్థలు ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News