bjp: కేంద్రం నిధులతోనే ‘చంద్రన్న బీమా’ నడుస్తోంది: సోము వీర్రాజు

  • గ్రామాల అభివృద్ధికి కేంద్రమే నిధులు ఇస్తోంది
  • ఏపీకి ఇచ్చిన హామీల్లో తొంభై శాతం మేము నెరవేర్చాం
  • ఎన్నికలప్పుడు టీడీపీ ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా నెరవేర్చలేదు: సోము వీర్రాజు

కేంద్రం నిధులతోనే ‘చంద్రన్న బీమా’ నడుస్తోందని, గ్రామాల అభివృద్ధికి కేంద్రమే నిధులు ఇస్తోందని, ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై ఒకరు డ్రామాలాడుతున్నారని, మరొకరు రాజీనామాలు చేస్తామంటున్నారని సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ఏపీకి ఇచ్చిన హామీల్లో తొంభై శాతం నెరవేర్చామని, ఎన్నికలప్పుడు టీడీపీ ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా నెరవేర్చలేదని, హామీల్లో భాగంగా చెప్పిన నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వడం లేదని విమర్శించారు.

More Telugu News