Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • భారీ పారితోషికం తీసుకున్న పూజా హెగ్డే 
  • వేసవికి పూరీ జగన్నాథ్ 'మెహబూబా'
  • మార్చ్ నెలాఖరుకి నాగ్, వర్మల చిత్రం పూర్తి 
  • వెంకటేశ్ సరసన మళ్లీ శ్రియా

*  ఐటెం పాటలకు హీరోయిన్లను తీసుకోవడం ప్రారంభం అయినప్పటి నుంచీ వాళ్లు పారితోషికాలు కూడా పెంచేశారు. కాజల్, తమన్నా, శ్రుతి హాసన్ లు గతంలో అలాగే భారీగా చార్జ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా పూజా హెగ్డే 'రంగస్థలం' చిత్రంలో ఐటెం సాంగు చేయడానికి ఏభై లక్షలు తీసుకుందట.    
*  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మెహబూబా' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆకాష్ పూరీ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  సుమారు రెండు దశాబ్దాల తర్వాత నాగార్జున, రాంగోపాల్ వర్మ కలసి చేస్తున్న చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ ప్రస్తుతం ముంబయ్ లో జరుగుతోంది. మార్చ్ నెలాఖరుకి షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా దర్శకుడు వర్మ ప్లాన్ చేశాడు. ఇందులో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
*  వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. పలువురిని పరిశీలించిన పిదప ఈ చిత్రంలో కథానాయికగా చివరికి శ్రియాను ఎంపిక చేశారు. గతంలో వెంకీ, శ్రియా కలసి 'సుభాష్ చంద్రబోస్', 'గోపాల గోపాల' చిత్రాలలో నటించారు.   

More Telugu News