Gun: అమెరికాలో దారుణాతి దారుణం.. కాల్పుల్లో 17 మంది విద్యార్థుల మృతి!

  • తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నందుకు రెచ్చిపోయిన పూర్వ విద్యార్థి
  • స్కూల్‌కు చేరుకుని విచక్షణ రహితంగా కాల్పులు
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అమెరికాలో మరోమారు తుపాకి రెచ్చిపోయింది. విచక్షణ రహితంగా గర్జించింది. ఫలితంగా అభంశుభం తెలియని విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్‌‌లోని స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేని పూర్వ విద్యార్థి నికోలస్ క్రజ్ (19) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

 తుపాకితో స్కూల్‌ కు చేరుకున్న క్రజ్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే 17 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎదురు కాల్పులు ప్రారంభించి క్రజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News