nikhil: 'పెళ్లి చూపులు' దర్శకుడికి ఓకే చెప్పేసిన నిఖిల్

  • నిఖిల్ కోసం కథ రెడీ చేసిన తరుణ్ భాస్కర్ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నిఖిల్ 
  • త్వరలోనే సెట్స్ పైకి

తెలుగులో చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి .. భారీ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో 'పెళ్లి చూపులు' ముందువరుసలో కనిపిస్తుంది. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఆయన కొత్త నటీనటులతో .. సురేశ్ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

రీసెంట్ గా ఆయన ఒక కథను సిద్ధం చేసుకుని వెళ్లి .. నిఖిల్ కి వినిపించాడట. నిఖిల్ కి ఈ కథ కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పేశాడని సమాచారం. త్వరలో 'కిరాక్ పార్టీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్న నిఖిల్, ప్రస్తుతం 'కణితన్' రీమేక్ పై దృష్టి పెట్టాడు. ఈ ప్రాజక్టును కూడా పూర్తి చేసిన తరువాత ఆయన తరుణ్ భాస్కర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.   

More Telugu News