India: మువ్వన్నెల జెండా కాంతుల్లో మెరిసిపోతున్న బుర్జు ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్స్!

  • యూఏఈ, అబుదాబిలోని ప్రముఖ కట్టడాలకు త్రివర్ణ పతాకపు రంగుల విద్యుత్ కాంతులు
  • విద్యుత్ కాంతులీనుతున్న అడ్నాక్ బిల్డింగ్, ఎమిరేట్స్ ప్యాలెస్, బుర్జు ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్స్  
  • ‘ఎప్పుడైనా మాటల కన్నా చిత్రాలే భావాలను మరింత ఎక్కువగా వ్యక్తం చేస్తాయి’ : యూఏఈలో భారత్ అంబాసిడర్ నవదీప్ సూరి

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం పశ్చిమాసియాలోని మూడు దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా దుబాయ్ లోని ప్రముఖ నిర్మాణాలు భారతదేశ జాతీయ జెండా రంగులతో విద్యుత్ కాంతులీనుతున్నాయి. ఈ విషయాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు భారత్ అంబాసిడర్ నవదీప్ సూరి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా యూఏఈ, అబుదాబిలోని అడ్నాక్ బిల్డింగ్, ఎమిరేట్స్ ప్యాలెస్, దుబాయ్ లోని బుర్జు ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్స్ భారతదేశ జాతీయ త్రివర్ణ పతాకం రంగులను పోలిన విధంగా విద్యుత్ వెలుగులతో నిండిపోయాయని, ‘ఎప్పుడైనా మాటల కన్నా చిత్రాలే భావాలను మరింత ఎక్కువగా వ్యక్తం చేస్తాయి’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్న ఆయన, ఆయా చిత్రాలను పోస్ట్ చేశారు.

కాగా, జోర్డాన్ పర్యటన ముగించుకున్న మోదీ ఈరోజు పాలస్తీనా చేరుకున్నారు. తొలుత పాలస్తీనా ప్రధాని రమీ హమదల్లాహ్ తో కలిసి పాలస్తీనా నేత యాసర్ అరాఫత్ సమాధి వద్ద నివాళులర్పించారు. 

More Telugu News