KTR: యాంకర్ ప్రదీప్‌ వినతిపై స్పందించిన మంత్రి కేటీఆర్!

  • చ‌ర్ల‌ప‌ల్లిలోని మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల దుస్థితిని వివరించిన ప్రదీప్
  • ఆ విద్యార్థుల సమస్యలను తీర్చుతామని కేటీఆర్ హామీ 
  • మేడ్చల్ కలెక్టర్‌కు ఆదేశాలు

ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి టీవీ యాంకర్ ప్రదీప్ ట్వీట్ చేసి రంగారెడ్డి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం చ‌ర్ల‌ప‌ల్లిలోని మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల దుస్థితిని వివ‌రించిన విషయం తెలిసిందే. ఆ పాఠ‌శాల‌లో బాత్రూమ్ లేదని, మంచి నీటి సదుపాయం కూడా లేదని ఆయన చేసిన వినతికి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఆ పాఠశాల విద్యార్థుల సమస్యలను తప్పకుండా తీర్చుతామని ట్వీట్ చేసి హామీ ఇచ్చారు. మేడ్చల్ కలెక్టర్ ఈ విషయంపై వెంటనే స్పందించాలని, సమస్యను పరిష్కరించి, ఆ విషయాన్ని మళ్లీ తనకు తెలియజేయాలని ఆదేశించారు.     

More Telugu News