కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన విజయసాయిరెడ్డి.. టీడీపీపై ఫిర్యాదు చేసిన వైనం!
- మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది
- ఏపీ ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలి
- ప్రధాన ఎన్నికల కమిషనర్ కు విజయసాయిరెడ్డి ఫిర్యాదు
కేంద్ర బలగాలతో మా ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలి
రాజ్యసభ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లను ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, ప్రత్యేక పరిశీలకుడిని నియమించి ఎన్నికలను పర్యవేక్షించాలని, కేంద్ర బలగాలతో తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని, ఏపీ ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ ని కోరామని చెప్పారు.