sensex: మార్కెట్లో జోష్.. వరుస నష్టాల తర్వాత లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

  • లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • 330 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 100 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

వరుసగా ఏడు రోజుల పాటు కొనసాగిన స్టాక్ మార్కెట్ల పతనానికి ఈ రోజు బ్రేక్ పడింది. ఎట్టకేలకు సెన్సెక్స్, నిఫ్టీలు ఈ రోజు లాభాలను నమోదు చేశాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మినహా హెల్త్ కేర్, రియాల్టీ, ఫార్మా తదితర సూచీలన్నీ గ్రీన్ లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంతో 34,413కు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 10,577 వద్ద క్లోజ్ అయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (10.72%), డెన్ నెట్ వర్క్స్ లిమిటెడ్ (8.75%), జీహెచ్సీఎల్ (8.51%), సిప్లా (7.83), భారత్ ఫోర్జ్ (7.73).

టాప్ లూజర్స్:
హెక్సావేర్ టెక్నాలజీస్ (-5.07%), వక్రాంజీ లిమిటెడ్ (-4.99%), స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ (-4.47%), జుబిలెంట్ లైఫ్ సెన్సెస్ (-3.79%), యుఫ్లెక్స్ (-3.61%)         

More Telugu News