Sonia Gandhi: పార్లమెంటులో ఊహించని పరిణామం.. టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు!

ఈనాటి లోక్ సభ సమావేశాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంతనాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితిపై ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితి గురించి ఆమెకు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, పి.రవీంద్రబాబులు వివరించారు. ఈ ఘటన సభలో ఉన్నవారి దృష్టిని ఆకర్షించింది.

మరోవైపు, ఇదే సమావేశాల్లో ఏపీకి ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అంటూ టీడీపీ ఎంపీలు ఆరోపించారు. మరోవైపు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా, ఆయన ఎదుట ప్లకార్డులు పట్టుకుని, నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఖర్గే పక్కనే సోనియా కూర్చున్నారు. ఆ సందర్భంగా టీడీపీ ఎంపీలపై ఖర్గే అసహనం వ్యక్తం చేసినా, సోనియా మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు.
Sonia Gandhi
Telugudesam mps
lok sabha

More Telugu News