Anushka Shetty: ఓవర్సీస్ లో 'భాగమతి' జోరు .. మిలియన్ డాలర్ మార్క్ ను దాటేసింది

  • ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున 8 కోట్ల షేర్
  • ఇంతవరకూ 30 కోట్ల షేర్ 
  • ఓవర్సీస్ లోను కొనసాగుతోన్న జోరు  

అనుష్క ప్రధానమైన పాత్రను పోషించిన 'భాగమతి' .. జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున ఈ సినిమా 8 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంతవరకూ ఈ సినిమా 30 కోట్ల షేర్ ను సాధించి, అనుష్కకి గల క్రేజ్ ను మరోమారు నిరూపించింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా ఓవర్సీస్ లో తన జోరు చూపిస్తోంది. నిన్నటి ఆదివారంతో ఈ సినిమా మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసిందని ట్రేడ్ పండితుల మాట. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక దక్షిణాది సినిమాకి, ఓవర్సీస్ లో ఈ స్థాయి వసూళ్లు లభించడం విశేషమని అంటున్నారు. కథాకథనాలు .. నేపథ్య సంగీతం .. అనుష్క అభినయం, ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు సాధించి పెడుతున్నాయని చెబుతున్నారు.        

More Telugu News