Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి.. నలుగురికి గాయాలు

  • సీఆర్పీఎఫ్ బృందంపై గ్రనేడ్ దాడి
  •  ఇద్దరు జవాన్లతోపాటు మరో ఇద్దరు పౌరులకు గాయాలు
  • గాలింపు చేపట్టిన పోలీసులు

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం పుల్వామా జిల్లాలోని ట్రాల్ సెక్టార్ లో ఉన్న బాటగండ్ గ్రామంలో సీఆర్పీఎఫ్ బృందంపై గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఆ పేలుడు తీవ్రతకు ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడితో ఈ ప్రాంతమంతటా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు.. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

More Telugu News