siddhardh: రకుల్ హిందీ మూవీ సెన్సార్ కి అడ్డంకులు

  • సిద్ధార్థ్ మల్హోత్రా .. రకుల్ జంటగా 'అయ్యారీ'
  • ఈ నెల 9వ తేదీన సినిమా రిలీజ్ 
  • ఆలస్యం కానున్న సెన్సార్ కార్యక్రమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ నాయకా నాయికలుగా, నీరజ్ పాండే దర్శకత్వంలో 'అయ్యారీ' అనే హిందీ సినిమా రూపొందింది. ఈ సినిమాను జనవరి 26వ తేదీనే విడుదల చేయాలనుకున్నారు గానీ, 'పద్మావత్' రిలీజ్ కారణంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే సెన్సార్ కార్యక్రమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియకపోవడంతో, యూనిట్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

 మిలటరీ విభాగంలో తెర వెనుక జరిగే కొన్ని సంఘటనలు .. ఆయుధాల ఒప్పందాలు .. కుట్రలు మొదలైనవి ఈ సినిమాలో చూపించారట. దాంతో ఈ సినిమాను తాము చూసిన తరువాతనే సెన్సార్ సర్టిఫికేట్ ను జారీ చేయాలని సెన్సార్ అధికారులను రక్షణ శాఖ కోరినట్టుగా వార్తలు వచ్చాయి. రక్షణ శాఖ అధికారులు ఈ సినిమాను ఎప్పుడు చూస్తారనే విషయంలో క్లారిటీ లేదు. ఈ కారణంగా విడుదల తేదీ విషయంలో అయోమయం ఏర్పడిందని అంటున్నారు.

More Telugu News