budget: రైల్వే జోన్ బడ్జెట్ లో ప్రస్తావించదగిన అంశం కాదు: కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మేలు కలిగే బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి ప్రశంసించారు. బడ్జెట్ లో రైతులకు పెద్దపీట వేయడం జరిగిందని ఆమె చెప్పారు. ఏపీకి రైల్వేజోన్ పై ఆమె మాట్లాడుతూ, రైల్వే జోన్ బడ్జెట్ లో ప్రస్తావించే అంశం కాదని తేల్చి చెప్పారు. దీనిపై ఇంకా ఒడిశాతో చర్చించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును నవయుగ కంపెనీకి పాత ధరలకే అప్పజెప్పి, కేంద్రమంత్రి గడ్కరీ ప్రజాధనాన్ని ఆదా చేశారని ఆమె అభినందించారు.