Chandrababu: సైకిల్ పై తన కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు

  • స్మార్ట్ సైకిళ్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం
  • కాలుష్య నివారణే లక్ష్యం
  • సచివాలయంలో 30 సైకిళ్లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సైకిల్ తొక్కారు. సచివాలయంలోని 2వ బ్లాక్ నుంచి తన కార్యాలయం వరకు ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. వివరాల్లోకి వెళ్తే, కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా స్మార్ట్ సైకిళ్ల వ్యవస్థను తొలిసారిగా అమరావతిలో ప్రవేశపెట్టారు. జర్మనీ నుంచి ఇప్పటికే 30 సైకిళ్లు అమరావతికి చేరాయి. వెలగపూడిలోని సచివాలయంలో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్ లను ఏర్పాటు చేశారు. సచివాలయం లోపల రెండు స్మార్ట్ సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ వద్ద మరో సైకిల్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ప్రతి స్టేషన్ లో 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు.

సైకిల్ తీసుకునే వారికి ప్రత్యేకంగా పాస్ వర్డ్, స్వైపింగ్ కార్డును కేటాయిస్తారు. ఈ పాస్ వర్డ్ ద్వారా మాత్రమే సైకిళ్లు తెరుచుకుంటాయి. పని పూర్తయిన తర్వాత ఈ మూడు స్టేషన్లలో ఎక్కడైనా సైకిళ్లను అప్పజెప్పవచ్చు. అల్యూమినియం, ఎల్లాయిడ్ తో తయారు చేయబడిన ఈ సైకిళ్లు వర్షంలో తడిసినా తుప్పుపట్టవు. ఈ సైకిళ్లకు మూడు గేర్లు ఉంటాయి. ఈ సందర్భంగా, స్మార్ట్ సైకిళ్లను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి ఓ సైకిల్ ను తొక్కుకుంటూ తన కార్యాలయానికి వెళ్లారు. 

More Telugu News