Padmaavat: రెండ్రోజుల్లో రూ. 50 కోట్ల మార్కు దాటిన 'ప‌ద్మావ‌త్‌'

  • రెండో రోజు పెరిగిన వ‌సూళ్లు
  • వివాదాలు, ఆందోళ‌న‌ల‌కు అతీతంగా చిత్రానికి ఆద‌ర‌ణ‌
  • బూమ్ అంటూ ట్వీట్ చేసిన దీపికా ప‌దుకునే

ఓ వైపు కర్ణిసేన విధ్వంసాలు సృష్టిస్తున్న‌ప్ప‌టికీ, వాటికి అతీతంగా 'ప‌ద్మావ‌త్' చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆదరిస్తున్నారు. మొద‌టి రోజు భ‌యంతో కొంత‌మంది మాత్ర‌మే థియేట‌ర్ల‌కు వెళ్లిన‌ప్ప‌టికీ, రెండో రోజైన రిప‌బ్లిక్ డే నాడు మాత్రం సినిమా చూడ్డానికి జ‌నం లైన్లు క‌ట్టారు. దీంతో మొద‌టిరోజు కలెక్ష‌న్ల‌కు దాదాపు రెట్టింపు వ‌సూళ్లు రెండో రోజు వ‌చ్చాయి. ఏక‌మొత్తంగా రెండు రోజుల వ‌సూళ్లు క‌లిపి రూ. 50 కోట్ల మార్కును దాట‌డం విశేషం.

బుధ‌వారం రాత్రి వేసిన ప్రీమియ‌ర్ షోల ద్వారా రూ. 4.25 కోట్లు, మొద‌టి రోజు థియేటర్ వసూళ్లు రూ. 17.75 కోట్లు రాగా, రెండో రోజు రూ. 32 కోట్లు వ‌సూలు చేసింది. దీంతో రెండ్రోజుల్లోనే దాదాపు రూ. 53 కోట్లు ఆర్జించిన‌ట్లైంది. ఈ వ‌సూళ్ల గురించి సినిమాలో ప‌ద్మావ‌తి పాత్ర‌లో న‌టించిన దీపికా ప‌దుకునే ట్వీట్ ద్వారా స్పందించింది. 'బూమ్' అంటూ పిడికిలి గుర్తు ఎమోజీని ఆమె ట్వీట్ చేసింది.

More Telugu News