sai dharam tej: షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న సాయిధరమ్ తేజ్

  • తేజు తాజా చిత్రంగా 'ఇంటెలిజెంట్'
  • కథానాయికగా లావణ్య త్రిపాఠి 
  • వచ్చేనెల 9వ తేదీన విడుదల

సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ ఒక సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి 'ఇంటిలిజెంట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వినాయక్ మార్క్ కి .. సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా ఈ సినిమా రూపొందిందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పార్టు నిన్నటితో పూర్తయింది.

సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ తో సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ వస్తోంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో సాయిధరమ్ తేజ్ వున్నాడు. ఇదే రోజున వరుణ్ తేజ్ మూవీ 'తొలిప్రేమ' విడుదలవుతుండటం విశేషం.    

More Telugu News