Kumaraswami: వెంకటేశ్వర స్వామి కలలో చెప్పాడంటూ, ఒక్క రూపాయికే చీర... కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన మహిళాలోకం!

  • బీదర్ లో విక్రయాలు ప్రారంభించిన వస్త్రదుకాణం యజమాని
  • కుమారస్వామి సీఎం కావాలంటే చీరలు పంచాలని వెంకన్న కలలో చెప్పాడట
  • 15 రోజుల పాటు ఒక్క రూపాయికే చీర

ఒక్క రూపాయికి ఏం వస్తుంది? కనీసం టీ కూడా రాదుగా అంటారా? అయితే మీరు బీదర్ వెళ్లి రావాల్సిందే. బీదర్ వెళితే, మీకు ఒకే ఒక్క రూపాయికి చీర లభిస్తుంది. తిరుమల వెంకటేశ్వరస్వామి చెప్పారంటూ, 5 లక్షల చీరలను ఒక్కొక్కటీ రూపాయికే అమ్మడాన్ని ప్రారంభించాడో వ్యక్తి. ఈ విషయమై ఇంకాస్త లోతుగా వెళితే, బీదర్ లోని ఓ వస్త్రదుకాణం యజమాని చంద్రశేఖర్, జేడీఎస్ పార్టీ వీరాభిమాని.

ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధించి, తమ నేత కుమారస్వామి మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాలన్నది ఆయన కోరిక. కొద్ది రోజుల క్రితం వెంకన్న కలలోకి వచ్చి, కుమారస్వామి మళ్లీ సీఎం కావాలంటే, 5 లక్షల చీరలను పంచాలని చెప్పాడట. దీంతో కేవలం ఒక్క రూపాయికే చీరను విక్రయించాలని నిర్ణయించానని, 15 రోజుల పాటు మాత్రమే ఈ స్కీమ్ అమలులో ఉంటుందని చెబుతున్న చంద్రశేఖర్ దుకాణం ముందు ఇప్పుడు మహిళలు బారులు తీరారు.

More Telugu News