Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో ఈరోజు భేటీ కానున్న పోలాండ్ అంబాసడర్

  • పవన్ తో భేటీ కానున్న బురాకోవస్కీ
  • హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సమావేశం
  • పోలండ్ దేశస్తుల ద్వారా పవన్ గురించి తెలుసుకున్న బురాకోవస్కీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పోలాండ్ దేశ అంబాసడర్ ఆడమ్ బురాకోవస్కీ నేడు భేటీ అవుతున్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో వీరి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా 20 మంది విద్యార్థులు కూడా సమావేశానికి హాజరుకానున్నారు. గత నవంబర్ లో పవన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా కొందరు పోలాండ్ దేశస్తులు పవన్ ను కలిశారు. వారి ద్వారా పవన్ గురించి తెలుసుకున్న బురాకోవస్కీ... ఇప్పుడు ఆయనను కలిసేందుకు హైదరాబాద్ విచ్చేశారు.

More Telugu News