padmavat: ‘పద్మావత్‌’ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదల!

  • ఈ నెల 25న 'పద్మావత్‌' విడుదల
  • ట్రైలర్ నిడివి 3.09 నిమిషాలు
  • అలరిస్తోన్న డైలాగులు

ఎన్నో వివాదాల మ‌ధ్య చిక్కుకుని చివ‌ర‌కు విడుద‌ల‌కు నోచుకున్న 'ప‌ద్మావ‌త్' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలైంది. 'ఆందోళనలను ఖడ్గం కొనపై ఉంచుతాడే వాడే రాజపుత్రుడు' అంటూ చెబుతోన్న డైలాగులు అదుర్స్ అనిపిస్తున్నాయి.

ఈ ట్రైలర్ నిడివి 3.09 నిమిషాలు ఉంది. ఈ సినిమాకు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించగా ప్రధాన పాత్రల్లో దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్ నటించారు. కాగా, ఈ సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని రాజ్‌పుత్ కర్ణిసేన హెచ్చరికలు చేస్తోన్న విషయం తెలిసిందే.   

More Telugu News